భవిష్యత్తులో ప్రధానిగా ధోని.. సీఎంగా విజయ్.. ఫోటోలు వైరల్
ఇండియన్ క్రికెట్ టీం మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని, తమిళ నటుడు విజయ్ ని తాజాగా కలిసిన సంగతి తెలిసిందే.;
ఇండియన్ క్రికెట్ టీం మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని, తమిళ నటుడు విజయ్ ని తాజాగా కలిసిన సంగతి తెలిసిందే. ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్లో భాగంగా చెన్నై వెళ్లిన ధోనీ అదే లొకేషన్ లో ఉన్న విజయ్ ని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరు లెజెండ్స్ మీట్ అవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ చేసిన సృష్టించిన పోస్టర్లు వివాదాస్పదం అయ్యాయి. భవిష్యత్తులోఎంఎస్ ధోనీని ప్రధానమంత్రిగానూ, విజయ్ను ముఖ్యమంత్రిగానూ చూడోబోతున్నాం అంటూ పోస్టర్లు అంటించారు. ఈ పోస్టర్లు దూమారం లేపుతున్నాయి.