Mahesh_Nagarjuna: మహేశ్, నాగార్జున మల్టీస్టారర్.. ట్వీట్తో హింట్..
Mahesh_Nagarjuna: ప్రస్తుతం సీనియర్ హీరో నాగార్జున ‘ది ఘోస్ట్’ అనే యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు.;
Mahesh_Nagarjuna: ఒకప్పుడు టాలీవుడ్లో పెద్దగా మల్టీ స్టారర్ చిత్రాలు తెరకెక్కేవి కాదు. కానీ సీనియర్ హీరోలు సైతం ముందుకొచ్చి మల్టీ స్టారర్లు చేయడానికి ఆసక్తి చూపిస్తుండడంతో దర్శకులు కూడా అలాంటి కథలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. కానీ అందులో కొన్ని కథలు మాత్రమే ఇద్దరు హీరోలను ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. అయితే త్వరలోనే నాగార్జున, మహేశ్ బాబు ఓ మల్టీ స్టారర్లో మెరవనున్నారా అని ప్రేక్షకుల్లో అనుమానం మొదలయ్యింది. దానికి కారణం ఆ ట్వీటే.
ప్రస్తుతం సీనియర్ హీరో నాగార్జున 'ది ఘోస్ట్' అనే యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ను ప్రత్యేకంగా మహేశ్ బాబు చేత విడుదల చేయించాడు నాగ్. అంతే కాకుండా ట్రైలర్ రిలీజ్ చేసినందుకు తనకు ధన్యవాదాలు కూడా తెలిపాడు. ది ఘోస్ట్ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు మహేశ్. ఈ ట్వీట్కు నాగార్జున ఓ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు.
'హాయి మహేశ్. 29 ఏళ్ల క్రితం 'వారసుడు' సినిమా కోసం మీ నాన్న సూపర్ స్టార్ కృష్ణ నాతో జాయిన్ అయినప్పుడు నేను చాలా సంతోషించాను. మనం ఎందుకు ఆ సర్కిల్ను పూర్తి చేయకూడదు!' అని నాగార్జున ట్వీట్ చేశాడు. దానికి సమాధానంగా మహేశ్ 'అలా జరిగితే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విషయంపై నేను ఎదురుచూస్తుంటాను' అన్నాడు. అయితే ఈ ట్వీట్స్ చూస్తుంటే మహేశ్, నాగార్జున కలిసి ఓ మల్టీ స్టారర్ చేయడానికి రెడీగా ఉన్నారా అని అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ ఇదే జరిగితే ఫ్యాన్స్కు ఫీస్టే!
Hey @urstrulyMahesh !! I was so happy 29 years ago when your father SuperStar Krishna Garu joined me for the film Varasudu !! Why don't we complete the circle 😊
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 25, 2022
Thank you for releasing #TheGhostTrailer 👍💥 https://t.co/cbgu8vtpH1