ఆయన మరణ వార్త విని.. నా గుండె పగిలింది : చిరంజీవి

Update: 2020-09-25 10:31 GMT

ప్రపంచ సంగీతానికి ఇది చీకటి రోజు. ఎవరికీ సాటిరాని మ్యూజిక్‌ లెజెండ్‌ ఎస్పీ బాలు గారి మరణంతో ఓ శకం ముగిసింది. వ్యక్తిగతంగా చెప్పాలంటే... నా కెరీర్‌ విజయంలో బాలు గారి స్వరం పాత్ర ఎంతో ఉంది. ఆయన నా కోసం ఎన్నో మధురమైన గీతాలు ఆలపించారు. ఘంటసాల గారి తర్వాత ఈ సంగీత ప్రపంచాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారా? .. అనే తరుణంలో ఓ తారలా బాలు గారు మ్యూజిక్‌ గెలాక్సీలోకి అడుగుపెట్టారు. భాష,  ప్రాంతం, హద్దులు.. అనేవి లేకుండా పలు దశాబ్దాలుగా ఆయన మధుర గాత్రం భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని అలరిస్తోంది. భవిష్యత్తులో మరో బాలసుబ్రహ్మణ్యం రాడు.. కేవలం ఆయన పునర్జన్మ మాత్రమే లోటును భర్తీ చేయగలదు. ఆయన మరణ వార్త విని, నా గుండె పగిలింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి బాలు గారు అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

Tags:    

Similar News