'బుల్లెట్ బండి' వైరల్ టూ ఒరిజినల్ ..!
'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా' అంటూ సాగే ఈ పల్లెటూరి పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వాస్తావానికి పాట వచ్చి చాలా రోజులైంది.;
'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా' అంటూ సాగే ఈ పల్లెటూరి పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వాస్తావానికి పాట వచ్చి చాలా రోజులైంది. కానీ మళ్ళీ ఈ పాటకి క్రేజ్ వచ్చింది. తాజాగా పెళ్లి బరాత్లో ఈ పాటకి నవవధువు సాయిశ్రియ డాన్స్ చేసి ఆదరగోట్టింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఓవర్ నైట్లో సెలబ్రిటీ అయిపొయింది. మరి ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్న 'బుల్లెట్టు బండి' పాట పాడిందెవరు?
'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా' అనే పాటను పాడింది సింగర్ మోహనా భోగరాజు... లక్ష్మణ్ కలం నుంచి జాలువారిన ఈ పాటకి ఎస్కే బాజి సంగీతం అందించారు. అచ్చమైన తెలంగాణ స్లాంగ్తో కూడిన ఈ పాటను అద్భుతంగా పాడింది మోహనా భోగరాజు.. ఆంధ్రా అమ్మాయి అయినప్పటికీ తెలంగాణ స్లాంగ్లో బాగా పాడింది. సంగీతంపై ఉన్న ఆసక్తితో, కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఆమె ప్లేబ్యాక్ సింగర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
బీటెక్ చేశాక ఇండస్ట్రీలోకి వచ్చింది. సింగర్ గా అవకాశాలు వచ్చాక ఎంబీఏ కంప్లీట్ చేసింది. టెక్నాలజీ ఇంత పెరిగిన ఇంకా సోషల్ మీడియాకు మాత్రం చాలా దూరంగా ఉంటుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత' సినిమాలో రెడ్డమ్మ తల్లి అనే పాట ఆమెకి ఫుల్ క్రేజ్ని తెచ్చిపెట్టింది. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో 'మగువా మగువా' ఫిమేల్ వెర్షన్ పాడింది కూడా మోహననే.. ఆమె గాత్రం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆమె కూడా అంతే అందంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో.
ఓ వైపు సినిమా పాటలతో అలరిస్తూనే టైం దొరికినప్పుడల్లా ప్రైవేటు ఆల్బమ్స్ చేయడం ఆమె స్పెషాలిటీ. అందులో భాగంగానే 'బుల్లెట్ బండి' ప్రైవేట్ ఆల్బమ్ని చేసిందమే. కేవలం పాట పాడడమే ఒక్కటే కాదు.. ఆ పాటకి తగ్గ స్టెప్పులేసి మరి అలరించింది మోహన.. ఈ ఏడాది ఏప్రిల్ 7న వచ్చిన ఈ పాటను ఇప్పటివరకు 3.7 కోట్ల మంది వీక్షించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. నవవధువు సాయిశ్రియ వీడియో వైరల్ అయ్యాకే చాలా మంది ఒరిజినల్ సాంగ్ని చూశారు.