షాక్లో ప్రియమణి భర్త.. 'ఆ వివాహం చెల్లదు.. అది అక్రమసంబంధమే' : అయేషా
అందం, అభినయంతో ఆకట్టుకోగల నటి ప్రియమణి.. అందులో ఎలాంటి సందేహం అక్కరలేదు.. హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉన్నప్పుడే ముస్తఫారాజ్ని ప్రేమించి పెళ్ళాడింది.;
అందం, అభినయంతో ఆకట్టుకోగల నటి ప్రియమణి.. అందులో ఎలాంటి సందేహం అక్కరలేదు.. హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉన్నప్పుడే ముస్తఫారాజ్ని ప్రేమించి పెళ్ళాడింది ఈ బ్యూటీ.. అయితే ప్రియమణిని పెళ్ళాడే సమయానికి ముస్తఫారాజ్కి భార్య కూడా ఉంది. ఆమె పేరు అయేషా. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ 2010 నుంచే విడివిడిగా బతుకుతున్నారు.
ఈ క్రమంలో ముస్తఫారాజ్ 2017లో నటి ప్రియమణిని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో పెళ్లి అనంతరం తన మొదటి భార్య పిల్లల కోసం ముస్తఫారాజ్ .. ప్రతి నెలా ఎంతో కొంత డబ్బు పంపిస్తూ వస్తున్నాడు. అయితే తన భర్త తనని, తన పిల్లలను సరిగ్గా పట్టించుకోవడం లేదని అయేషా తాజాగా మీడియా ముందు వాపోయింది. అయితే ఈ ఆరోపణలను ముస్తఫా రాజ్ ఖండించాడు.
'నా మీద వచ్చిన ఆరోపణలు అబద్ధం. పిల్లల పెంపకం కోసం అవసరమైనంత డబ్బును ఆయేషాకు క్రమం తప్పకుండా ఇస్తున్నాను. కానీ ఆమె నా దగ్గర నుంచి మరింత డబ్బును దొంగిలించాలని చూస్తోంది. పైగా హింసించానంటూ మాట్లాడుతోంది. మరి నేను తనను హింసింస్తే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదు? అని ప్రశ్నించాడు. ఇదిలా ఉంటే ఆయేషా మాత్రం ముస్తఫా తనకు మాజీ కాదని, ఇప్పటికీ భర్తే అంటూ పేర్కొంది.
ప్రియమణిని రెండో పెళ్లి చేసుకునేనాటికి కనీసం మేము విడాకుల కోసం కూడా దరఖాస్తు చేయలేదంటూ పేర్కొంది. కాబట్టి ప్రియమణితో అతడి వివాహం చెల్లదని, అది అక్రమ సంబంధం కిందికి వస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పండి? వీలైతే మాట్లాడుకుని సమస్యను చక్కదిద్దుకోవాలని చూస్తారు, లేదంటే వేరే దారి చూసుకోవడం తప్ప మరో దిక్కు లేదు. కానీ ఇప్పుడతడు తన సమయాన్ని నాకు వ్యతిరేకంగా వాడాలని చూస్తున్నాడు' అని ఆయేషా అభిప్రాయపడింది.
మరి దీనిపైన ప్రియమణి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా తాజాగా ప్రియమణి నటించిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్, 'నారప్ప' సినిమా ప్రేక్షకులను మెప్పించాయి.