Tollywood: ఉగాది నంది పురస్కారాలు

Update: 2023-03-23 12:30 GMT

తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక ఆద్వర్యంలో ఉగాది సినిమా పురస్కారాలు ఎల్ వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన "బలగం" చిత్ర బృందానికి ఉగాది నంది సత్కారం లభించింది. బలగం చిత్ర నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్‌లతో పాటు ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్ నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

ఈ వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు కాదంబరి కిరణ్, రామ్ రావిపల్లి, రవికాంత్, నిర్మాతలు కూనిరెడ్డి శ్రీనివాస్, మోహన్ గౌడ్, గల్ఫ్ వాసు, అని ప్రసాద్, ప్రవీణ నాయుడులకు అలాగే వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న పలువురిని ఉగాదినంది పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా బలగం సినిమా నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత, నటీనటులు సాంకేతిక నిపుణులు తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు విజయ్ వర్మ పాకలపాటికి కృతఙ్ఞతలు తెలియజేశారు. "బలగం" లాంటి చిత్రాలు మరిన్ని రావాలని ఇదొక దృశ్యకావ్యం అని ఆర్ నారాయణమూర్తి, రుద్రరాజు పద్మ రాజు కొనియాడారు. త్వరలో "సింహ" పేరుతొ ప్రభుత్వం తరపున పురస్కారాలు ఇచ్చే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని తెలంగాణ ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రకటించారు.

Similar News