అమెరికాలో ఫైరింగ్ (America) మళ్లీ కలకలం రేపింది. 'సూపర్ బౌల్' టోర్నీ విజేత కేన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు నిర్వహించిన ర్యాలీలో గురువారం కాల్పులు జరిగాయి. ఈ ఫైరింగ్ లో ఒకరు మృతి చెందారు. 21 మంది గాయాలపాలై ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. వీరిలో కొందరి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టు తెలుస్తోంది.
ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. కాల్పులకు తెగబడ్డ నిందితుడిని ఫ్యాన్స్ కొందరు వెంబడించి పట్టుకున్నారు. ఈ హైడ్రామాను వీడియో కళ్లకు కడుతోంది. కేన్సాస్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోను తాము చూశామని పోలీసులు చెప్పారు. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది నెలన్నర సమయంలోనే అమెరికాలో మొత్తం కాల్పుల ఘటనలు దీంతో 49కి చేరాయి. మిజోరీ గవర్నర్, ఆయన భార్య కూడా ఇదే సమయలో పరేడ్ లో ఉన్నారు. నిందితులు కాల్పులకు తెగబడగానే భద్రతా సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.