యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) బంపరాఫర్ ఇచ్చింది. 10 రోజులపాటు వాటర్ బెడ్పై పడుకుంటే రూ.4.7 లక్షల జీతం చెల్లిస్తోంది. వాటర్ప్రూఫ్ ఫ్యాబ్రిక్తో స్పెషల్ బాత్ టబ్లు తయారు చేసింది. ఇందులో పడుకునే 10 మంది వాలంటీర్లకు ఫుడ్, డ్రింక్స్, ఫోన్ అన్ని సమకూరుస్తారు. ఈ 10 రోజులూ వారు ఆ బెడ్పై విశ్రాంతి తీసుకోవడమే పని. స్పేస్ జర్నీలో మానవ శరీరంపై ఉండే ప్రభావాలను అంచనా వేసేందుకే ESA ఈ ప్రయోగం చేపట్టింది.
ఫ్రాన్స్లోని మెడెస్ స్పేస్ క్లినిక్ల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా ఓ ప్రయోగం చేపట్టింది. ముఖ్యంగా అంతరిక్ష యానంలో ఉన్న మానవులపై ఎలాంటి ప్రభావం పడుతుంది, దాన్ని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇందుకోసం మనుషులు నేరుగా అంతరిక్ష యానానికి పంపకుండా.. ఓ గదిలోనే వాటర్ బెడ్డుపై పడుకోబెడుతుంది. ఇది వాటర్ బెడ్కు సంబంధించిన చివరి ప్రయోగం కాగా.. దీంట్లో 10 మంది వాలంటీర్లను ఎంపిక చేశారు.