Rajendra Prasad : లపాకీనే ఎన్టీఆర్కు పట్టిన దరిద్రం.. రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు చిత్ర సీమ నటుడు రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లపాకినే ఎన్టీఆర్కి పట్టిన పెద్ద దరిద్రం అన్నారు. అప్పట్లో దేవుడు లాంటి ఎన్టీఆర్ కు ఒక దరిద్రం పట్టిందని.. ఆ దరిద్రం వచ్చిన తర్వాతే ఆయన జీవితమంతా మారిపోయిందని అన్నారు. ప్లాన్ చేసుకొని మరీ ఎన్టీఆర్ జీవితంలోకి దూరిందని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఆవిడ నుంచి టీడీపీకి చంద్రబాబు విముక్తి కలిగించారని చెప్పారు. ఆమె మీద తనకు ఇప్పటికీ గౌరవం లేదని.. ఉండాల్సిన అవసరం కూడా లేదని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.