UP : ఫస్ట్ నైట్ రోజే భర్తకు ఊహించని షాకిచ్చిన భార్య!

Update: 2025-06-25 12:30 GMT

యూపీలో భర్తలను వణికిస్తున్నారు భార్యలు. పెళ్లి తర్వాత ప్రియుళ్లతో కలిసి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఫస్ట్ నైట్ రోజే భర్తకు ఊహించని షాకిచ్చింది ఓ భార్య. 'నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు అవుతావ్' అని కత్తితో వార్నింగ్ ఇచ్చింది. 'నేను అమన్ ఆస్తిని, నాపై అతనికి మాత్రమే హక్కు' ఉందంటూ సితార వ్యాఖ్యనించింది. ఏప్రిల్ 29న నిషాద్, సితార వివాహం జరిగింది. మే 2న అత్తింటి వద్ద గ్రాండ్ రిసెప్షన్ జరగగా.. అనంతరం ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అయితే ఫస్ట్ నైట్ రోజు కట్టుకున్న భర్తకు కత్తితో వార్నింగ్ ఇచ్చింది సితార. తన ప్రియుడు అమన్ దగ్గరికి పంపించాలని లేకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది. మే 25న పెద్దల సమక్షంలో పంచాయితీ జరగగా.. మే 30న అమన్‎తో వెళ్లిపోయింది సితార. ప్రాణభయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు నిషాద్. సితారకు అమన్‌ వరుసకు మేనల్లుడు కావడం గమనార్హం. సోనమ్‌ ఉదంతం నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News