సికింద్రాబాద్ (Secunderabd) కంటోన్మెంట్లోని లోత్కుంట బస్స్టాప్లో నిండుగా ఉన్న టీఎస్ఆర్టీసీ (TSRTC) బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. ఈ ఘటన ఫిబ్రవరి 19, సోమవారం జరిగింది. వెంటనే స్పందించిన బస్సు డ్రైవర్ కూడా బస్సును నిలిపివేశాడు. అక్కడే ఉన్న కొంతమంది యువతులు ఆమెను పైకి లేపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో బ్యాగ్రౌండ్ లో తోటి ప్రయాణీకుల అరుపులు వినబడుతున్నాయి. కొందరు ఆమె నిలబడటానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా మహిళలు, లింగమార్పిడి ప్రయాణీకులకు ఉచిత ప్రయాణాన్ని అందించే మహాలక్ష్మి పథకం ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన సర్వే ఆధారంగా మహిళా ప్రయాణికులలో దాదాపు 31% విపరీతమైన పెరుగుదల ఉంది.
ఈ పథకం ప్రారంభించిన తర్వాత వారి రోజువారీ ప్రయాణానికి TSRTC బస్సులను ఉపయోగించే మహిళల శాతం 52% నుండి 81%కి పెరిగింది. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఇక ఆ తర్వాత జనవరి 30న TSRTC.. 3,000 మంది ఉద్యోగుల నియామకాన్ని కూడా ప్రకటించింది. పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యను పరిష్కరించడానికి, ఫిబ్రవరి 15న, TSRTC నడవకు ఇరువైపులా ఉన్న 'ఫ్రంట్ ఫేసింగ్ సీట్లు' నుండి మెట్రో వంటి సైడ్-ఫేసింగ్ సీట్లకు సీటు అమరికను మార్చాలని నిర్ణయించింది.