Miss World : మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా రెడీ.. కన్నుల పండుగే!

Update: 2024-02-10 09:24 GMT

ఫిబ్రవరిలో పెద్దగా పండుగలు రావు. కానీ కన్నుల పండుగ వస్తోంది. అదే ప్రపంచ సుందరాంగులంతా ఒకే ప్లేస్ లో కనిపించనున్నారు. న్యూఢిల్లీలోని అశోక హోటల్ లో 71వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ ప్రీ ఈవెంట్ డీటెయిల్స్ ను ప్రెస్ మీట్ లో ప్రకటించారు.

దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభ వేడుక ఫిబ్రవరి 18న మొదలు కానుంది. మార్చి 9 ఈ వేడుకలు మెగా గ్రాండ్ ఫినాలోతో ముంబైలో ముగుస్తాయి. వివిధ దేశాలకు చెందిన 120 మంది అందెగత్తెలు వివిధ పోటీల్లో, సోషల్ సర్వీస్ కార్యక్రమాల్లో భారత్ వేదికగా పార్టిసిపేట్ చేస్తారు.

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారతదేశం ప్రపంచ సుందరి ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తోంది. ప్రస్తుత మిస్ వరల్డ్, నలుగురు మాజీ విజేతలు ఈవెంట్ కు సంబంధించిన డీటెయిల్స్ ను ఢిల్లీలో ప్రకటించారు. ఇండియా పట్ల తనకున్న ప్రేమ ఎనలేనిదని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, సీఈవో జూలియా మోర్లీ తెలిపారు. అన్ని దేశాల ఆహ్వానితులను ఇండియాకు రావాలని విష్ చేశారు.

Tags:    

Similar News