22 ఏళ్ల మహసా అమినీ పోలీసు కస్టడీలో మరణించిన తర్వాత 2022లో జరిగిన నిరసనలపై దేశవ్యాప్తంగా నిర్దాక్షిణ్యంగా అణిచివేత తర్వాత.. ఇస్లామిక్ దేశమైన ఇరాన్ లో ఎన్నికల కోసం పార్లమెంటరీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. 290 సీట్ల ఛాంబర్లో రికార్డు స్థాయిలో 15,200 మంది అభ్యర్థులు నాలుగేళ్ల కాలానికి పోటీ చేయనున్నారు. ఇది 2020 ఎన్నికలలో అభ్యర్థుల కంటే రెండింతలు ఎక్కువ.
అప్పట్లో బహిరంగ ప్రదేశంలో బురఖా (నలుపు కండువా) సరిగ్గా ధరించనందుకు ఇరానియన్ మోరాలిటీ పోలీసులు అమినీని అరెస్టు చేశారు. ఇరాన్ పోలీసులచే దారుణంగా హింసించబడిన అనేక వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అవడం, ఆ తరువాత ఆమె కోమాలోకి జారిపోయినట్లు చూపించాయి. ఇది దేశం సాంప్రదాయిక ఇస్లామిక్ థియోక్రసీకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త నిరసనలను ప్రేరేపించింది.
హక్కుల సంఘాల ప్రకారం, అధికారులు హింసాత్మక అణిచివేతతో ప్రతిస్పందించారు. ఈ ఘటనలో 500 మందికి పైగా మరణించారు. 22,000 మందికి పైగా నిర్బంధించబడ్డారు. 2023 ప్రారంభంలో ప్రదర్శనలు చాలా వరకు తగ్గాయి. చాలా నెలలుగా, టెహ్రాన్, ఇతర నగరాల్లో మహిళలు బహిరంగంగా స్కార్ఫ్ నియమాన్ని చాటుకోవడం చూడవచ్చు. ఇది వేసవిలో మళ్లీ అణిచివేతకు దారితీసింది. అమినికి మరణానంతరం EU మానవ హక్కుల బహుమతి లభించింది.