ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయె ల్ వైమానిక దాడి చేసింది. ఇరాన్లోని అణుస్థావరాలే లక్ష్యంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బగేరి, పారా మిలిటరీ రెవల్యూషన రీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ, ఇతర ఉన్నతాధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు మరణించారు. అయితే ఈ దాడులకు ఇరాన్ ప్రతిస్పందించే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితిని ప్ర కటించింది. న్యూక్లియర్ కార్యక్రమాన్ని ఇరాన్ తరచూ అభివృద్ధి చేస్తుండటంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటిని తాము ఇంకెంత కాలం భరించాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ దాడుల తర్వాత పేర్కొన్నారు. ప్రపంచ అణు ఇంధన సంస్థ కూడా తనిఖీలకు ఇరాన్ సహకరించడం లేదని మొదటి సారిగా ప్రకటించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నే పధ్యంలో ప్రపంచ మార్కెట్ లో చమురు ధరలు ఒక్కసారిగా 6 శాతం పెరిగాయి.