AP : సీట్ల ఖరారుపై ఆ 3 పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం

AP : సీట్ల ఖరారుపై ఆ 3 పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం

బీజేపీ, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ), పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలు సీట్ల పంపకాల ఫార్ములాకు అంగీకరించాయని వర్గాలు తెలిపాయి. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత కొన్ని రోజులుగా మూడు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. మార్చి 8న అర్ధరాత్రి ఈ డీల్‌ ఖరారైనట్టు తెలుస్తోంది.

ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 24 లోక్‌సభ స్థానాల్లో జనసేన, బీజేపీలకు దాదాపు ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఈ రెండు పార్టీలకు 28 నుంచి 32 సీట్లు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మిగిలిన అసెంబ్లీ స్థానాలు టీడీపీకి వస్తాయని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా, టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నేతల ఆహ్వానం మేరకే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చారని చెప్పారు. ప్రాథమిక చర్చలు ముగిశాయని, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయని అన్నారు. ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై త్వరలో బీజేపీ నేతలతో చంద్రబాబు సమావేశమవుతారని, సీట్ల విషయంపై తర్వాత ప్రకటన వెలువడుతుందని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తమ పార్టీ కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయని, అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందుతున్నాయని టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కె.రవీంద్ర కుమార్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story