KA Paul : మా ఇంట్లో 18 ఓట్లు నాకు పడలేదు - కేఏ పాల్

KA Paul : మా ఇంట్లో 18 ఓట్లు నాకు పడలేదు - కేఏ పాల్

విశాఖ ఎంపీగా పోటీ చేసిన కేఏ పాల్ తనకు పోలైన ఓట్ల సంఖ్యపై స్పందించారు. ఈసీ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తనకు పడిన లక్షలాది ఓట్లు టీడీపీ, జనసేన, బీజేపీకి వెళ్లిపోయాయని ఆరోపించారు.

ఈవీఎంలకు సెక్యూరిటీ కల్పించలేదని.. సెంట్రల్ ఈసీకి దీనిపై ఫిర్యాదు చేస్తానన్నారు. మురళీనగర్ లో తన కుటుంబానికి 22 ఓట్లు ఉంటే.. తనకు 4 ఓట్లే పడ్డాయన్నారు కేఏ పాల్.

సీసీటీవీలను ఏర్పాటు చేయలేదని, తనకు వచ్చే 5 లక్షల ఓట్లు ఏమయ్యాయని, తన కుటుంబ సభ్యుల ఓట్లు ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు కేఏ పాల్. ఈ దరిద్రపు ఎన్నికలు అక్కర్లేదని, తనకు 8 చోట్ల సున్నా ఓట్లు పడ్డాయని చెప్పారు. దీనిపై కోర్టుకెళతానంటూ ఆయన మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.

Tags

Next Story