Chandrababu: జగన్‌ రెడ్డి డర్టీ గ్యాంగ్ వల్ల మహిళల భద్రత ప్రమాదంలో పడింది- చంద్రబాబు

Chandrababu: జగన్‌ రెడ్డి డర్టీ గ్యాంగ్ వల్ల మహిళల భద్రత ప్రమాదంలో పడింది- చంద్రబాబు
Chandrababu: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం జగన్ తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం జగన్ తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ రెడ్డి డర్టీ గ్యాంగ్ వల్ల ఏపీలో మహిళల భద్రత ప్రమాదంలో పడిందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని, తక్షణమే అతన్ని డిస్మిస్ చేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. అటు, వంగలపూడి అనితకు వైసీపీ నేత ఫోన్ చేసి బెదిరించడాన్ని చంద్రబాబు ఖండించారు.

వరద బాధితుల్ని ఆదుకోవడంలోనూ వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందన్నారు. పాఠశాలల విలీనంలోనూ ప్రభుత్వం తప్పులు చేసిందన్నారు టీడీపీ నేతలు. పేద విద్యార్థుల విద్యావకాశాలకు గండికొట్టేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో తీసుకురావాల్సిన సంస్కరణలపైనా పొలిట్‌బ్యూరోలో చర్చ జరిగింది. యువతకు భాగస్వామ్యంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

బీసీ జనగణన జరపాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 13, 14, 15 తేదీల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పొలిట్‌బ్యూరో తీర్మానం చేసింది. ఈ సందర్భంగా గ్రామాల్లో బైక్ ర్యాలీలు చేపట్టాలని పిలుపిచ్చారు. 15న చంద్రబాబు ఆధ్వర్యంలో సభ కూడా నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story