Chandrababu: టీడీపీలో బలమైన బీసీ నేతలు లక్ష్యంగా అక్రమ కేసులు: చంద్రబాబు
By - Divya Reddy |19 Jun 2022 11:10 AM GMT
Chandrababu: అయ్యన్న పాత్రుడి ఇంటిపై జగన్ రెడ్డి చీకటి దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Chandrababu: అయ్యన్న పాత్రుడి ఇంటిపై జగన్ రెడ్డి చీకటి దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ట్విట్టర్ వేదికగా జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపేనన్నారు. టీడీపీలో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు తెగబడుతున్నారని ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాడనే అక్కసుతోనే అయ్యన్నపాత్రుడి ఇంటిపై చీకటి దాడులు చేయించారిని మండిపడ్డారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com