AP : కుర్చీ మార్పించిన చంద్రబాబు.. వీడియో వైరల్

AP : కుర్చీ మార్పించిన చంద్రబాబు.. వీడియో వైరల్

విజయవాడలో మంగళవారం జరిగిన టీడీపీ-జనసేన - బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశంలో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమర్థించారు. ఈ సందర్భంగా పవన్ చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో వేదికపై

చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు కోసం పసుపు టవల్ వేసిన ప్రత్యేకమైన కుర్చీని ఏర్పాటు చేశారు. చంద్రబాబు తన సిబ్బందిని పిలిచి తనకు కూడా పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ కూర్చున్న లాంటి కుర్చీనే తెప్పించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags

Next Story