Chandrababu: టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్..

Chandrababu: టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్..
Chandrababu: రివర్స్‌ టెండరింగ్‌ పేరిట జగన్‌ పోలవరం ప్రాజెక్టును రివర్స్‌ చేశారంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు.

Chandrababu: రివర్స్‌ టెండరింగ్‌ పేరిట సీఎం జగన్‌ పోలవరం ప్రాజెక్టును రివర్స్‌ చేశారంటూ ఎద్దేవా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. అనేక సమకాలీన అంశాలపై వారితో చర్చించారు. డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి ఈ ప్రభుత్వ మూడేళ్ల నిర్వహణ వైఫల్యమే కారణమన్నారు. పోలవరం పనులు చేస్తున్న ఏజెన్సీని మార్చవద్దన్న కేంద్రం సూచనలను రాష్ట్రం పాటించకపోవడం వల్లనే అనర్థం జరిగిందని ఆరోపించారు.

డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి నూరు శాతం ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఇక ఆత్మకూరు ఉప ఎన్నిక విషయంలో వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలపైనా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలు కనీస సంస్కారం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే సీటు ఇస్తే పోటీ పెట్టకూడదు అనేది టీడీపీ విధానమని… ఈ విధానంతోనే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని తెలిపారు.

బద్వేలు లో ఎందుకు పోటీ పెట్టలేదో.. ఆత్మకూరులో కూడా అందుకే పోటీ పెట్టలేదని.. ఇది గమనించకుండా అధికార పార్టీ నేతలు అడ్డమైన సవాళ్లు చేస్తున్నారంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు.. ప్రజలు, ఉద్యోగులపై దాడులు చెయ్యడం పరిపాటిగా మారిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏఈ సూర్యకిరణ్ పై దాడి చేయడం దారుణమన్న చంద్రబాబు… ప్రజా ప్రతినిధులే అధికారులపై దాడులు చేస్తుంటే.. సిఎం మౌనం ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story