AP : ఏపీలో ఒక్కరోజే భారీగా దాఖలైన నామినేషన్లు

AP : ఏపీలో ఒక్కరోజే భారీగా దాఖలైన నామినేషన్లు

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు నిన్న భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కరోజే ఎంపీ స్థానాలకు 203 మంది అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు 1,123 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు ఎంపీ స్థానాలకు 555 మంది, ఎమ్మెల్యే స్థానాలకు 3,084 మంది నామినేషన్ వేసినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది.

నిన్నటితో మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించిన సీఎం జగన్.. ఇవాళ పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 7.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందుల వెళ్తారు. అక్కడ సీఎస్ఐ చర్చి గ్రౌండులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు.

నేటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో రేపు నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఉపసంహరణకు ఈ నెల 29 వరకు ఛాన్స్ ఉంటుంది. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. ఈ నాలుగో దశలో ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్ , బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story