Mangalagiri : మంగళగిరి చేనేతల కోసం లోకేశ్ కొత్త స్కీమ్

Mangalagiri : మంగళగిరి చేనేతల కోసం లోకేశ్ కొత్త స్కీమ్

Mangalagiri మంగళగిరిలో ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ (TDP) జాతీయ కార్యదర్శి లోకేశ్ (Lokesh) కొత్త ఆలోచన చేశారు. అదే వీవర్స్ సెంటర్. ఈ వీవర్స్ సెంటర్ ను నారా బ్రాహ్మణి మంగళగిరిలో ప్రారంభిస్తారు. టాటా తనేరా సహకారంతో ఈ వీవర్స్ రిసోర్స్ సెంటర్ ను ఏర్పాటుచేశారు.

30వేల మందికి పైగా చేనేత కార్మికులు మంగళగిరి సెగ్మెంట్ పరిధిలో ఉన్నారు. చేనేత కార్మికులు, డై వర్కర్స్ తో ఇటీవలే లోకేశ్ మాట్లాడారు. పాలసీ మార్చితే సరిపోదని, సమూలంగా వ్యవస్థలో మార్పులు తేవాలని నిర్ణయించి నిపుణులతో మాట్లాడి ప్రణాళిక ప్రకటించారు. చేనేత కార్మికులు సాంప్రదాయ పద్ధతిలో రోజుకి 12 గంటలు పనిచేస్తున్నారు. వీరికి కొత్త టెక్నాలజీ వాడడం నేర్పి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 30 శాతం ఉత్పత్తి పెంచేలా శిక్షణ ఇస్తారు. హైస్పీడ్ చరఖా, రాక్ లూమ్స్, మెకానికల్ లిఫ్టర్స్ వంటివి కార్మికులు వాడటం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు తక్కువ గంటల్లో ఎక్కువ ఉత్పత్తి సాధిస్తారని లోకేశ్ తెలిపారు.

లోకేశ్ తన టీమ్ తో కలిసి www.weaversdirect.in వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంలో ఏ మూలనుంచైనా మంగళగిరి చీరలు, వస్త్రాలు ఆన్ లైన్‌లో ఆర్డర్ చేయొచ్చు. వచ్చే లాభం నేరుగా చేనేతలకే చేరుతుంది. చేనేత ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేరుతాయి. ఇంటిల్లిపాదీ రోజుల తరబడి కష్టపడి నేసిన చీరలు, వస్త్రాలు దళారుల చేతికి చిక్కి లాభాలు తగ్గిపోతున్నాయి. చేనేతల్ని దోచుకునే మధ్య దళారీలకి చెక్ పెట్టి నేరుగా తాము నేసిన చీరలు, వస్త్రాలు తామే అమ్ముకునేలా ఈ వెబ్ సైట్ రూపొందించారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఈ ఒప్పందంలో భాగమయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story