AP : నారా లోకేశ్ ఆస్తులు ఎంత పెరిగాయంటే..?

AP : నారా లోకేశ్ ఆస్తులు ఎంత పెరిగాయంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తన ఆస్తుల వివరాలు ఈసీకి సమర్పించారు. ఆయన భార్య ఆస్తుల విలువ రూ.523 కోట్లుగా ప్రకటించారు. ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. నారా లోకేష్‌ వార్షిక ఆదాయం రూ.1,41,64,363. జీవిత భాగస్వామి బ్రాహ్మణి ఆదాయం రూ. 7,57,04,812. వీరిద్దరికీ మొత్తం రూ.18కోట్ల అప్పులు ఉన్నాయి.

హెరిటేజ్ ఫుడ్స్, రిలయన్స్‌లో షేర్లు వీరి ఆస్తులు. బ్రాహ్మణికి మాదాపూర్‌లో భూమి, రంగారెడ్డిలో వ్యవసాయ భూమి, చెన్నైలో వాణిజ్య భవనం ఉన్నాయి. లోకేష్, తండ్రి చంద్రబాబు సంయుక్తంగా రూ.7,99,59,988 విలువైన ఇంటిని నిర్మించారు. లోకేశ్ పై మొత్తం 23 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

మంగళగిరి టీడీపీ, వైసీపీలకి ప్రెస్టీజియస్ సీటు. ఇక్కడ గతంలో ఓడినా లోకేశ్ ఇక్కడినుంచే మళ్లీ పోటీ చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలని పట్టుదలమీదున్నారు. రాజధాని రైతుల ఓట్లే లోకేశ్ బలం.

Tags

Read MoreRead Less
Next Story