AP : టీడీపీలో పెండింగ్ స్థానాలివే

AP : టీడీపీలో పెండింగ్ స్థానాలివే

ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) విడుదల చేశారు. 11 ఎమ్మెల్యే, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 3 విడతల్లో అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన టీడీపీ.. 4 ఎంపీ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. విజయనగరం సీటు తీసుకుని బీజేపీకి రాజంపేట స్థానం కేటాయించడంపై చర్చలు నడుస్తుండగా.. కడప విషయంలో శ్రీనివాసులురెడ్డి/వీరశివారెడ్డి, ఒంగోలులో మాగుంట కుటుంబంలో పోటీపై చర్చ, అనంతపురంలో బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. ఇక ఎచ్చెర్ల, భీమిలి, చీపురుపల్లి సహా మరో 2 అసెంబ్లీ స్థానాలపై బీజేపీతో స్పష్టత రావాల్సి ఉంది.

టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొందరికి దాదాపుగా సీట్లు లేనట్లే కనిపిస్తోంది. కళా వెంకట్రావు, దేవినేని ఉమ, సత్యనారాయణ, జవహర్‌కు మూడో జాబితాలోనూ చోటు దక్కలేదు. ఇటు చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావు పోటీపై సందిగ్ధం నెలకొంది. దీంతో అక్కడి సీనియర్ నాయకురాలు కిమిడి మృణాళిని సీటు పైనా క్లారిటీ రాలేదు. మరోవైపు సీనియర్లు సోమిరెడ్డి, కోళ్ల లలిత, వనమాడి వెంకటేశ్వర్లు టికెట్లు కన్ఫార్మ్ చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story