AP : బాబు సీఎం అయితే.. వంగవీటి రాధాకు కీలక పదవి!
ఏపీలో కూటమి అధికారంపై గంపెడాశలు పెట్టుకుంది. ఈసారి కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నప్పటికీ.. జగన్ మాత్రం పట్టు వీడటం లేదు. దీంతో.. ఏపీలో హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్నారు పరిశీలకులు.
ఏపీలో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కూటమి అధికారంలోకి వస్తే టీడీపీకి సేవలందిస్తున్న వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. దెందులూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ నియోజకవర్గానికి వెళ్లమంటే అక్కడకు వెళ్తున్నారన్నారు. ఆయన సేవలకు తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా జగన్ టార్గెట్ గా రాధా ఇచ్చిన ప్రసంగం వైరల్ అవుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com