AP : రామోజీరావు విగ్రహం చేయిస్తున్న టీడీపీ ఎంపీ

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ( Ramoji Rao ) విగ్రహం రూపుదిద్దుకుంటోంది. విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు ( Kalisetty Appala Naidu ) (గతంలో ఈనాడు రిపోర్టర్) కోరికతో విగ్రహం తయారుచేస్తున్నట్లు కోనసీమ జిల్లా కొత్తపేటలోని ప్రముఖ శిల్పి రాజకుమార్ వుడయార్ తెలిపారు. రామోజీరావు గురించి భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ‘ఈనాడు’ ప్రారంభమైన విశాఖపట్నంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని అప్పలనాయుడు చెప్పారు.
అనేక చిత్రాలు పరిశీలించి చివరికి 60 ఏళ్ల వయసులో రామోజీరావు ఎలా ఉన్నారో అలాంటి మూర్తి తయారీకి ఉపక్రమించారు. ఏడున్నర అడుగుల ఈ విగ్రహానికి కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి రూపు తీసుకొచ్చారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విగ్రహాన్ని పరిశీలించారు.
తెలుగువారి స్ఫూర్తి ప్రదాత రామోజీరావు విగ్రహం తయారు చేసే భాగ్యం తనకు దక్కడం అదృష్టమని శిల్పి రాజ్కుమార్ వుడయార్ తెలిపారు. విగ్రహాన్ని ఈనాడు పత్రిక స్థాపించిన విశాఖలో ప్రతిష్టిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com