AP : నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

X
By - Manikanta |22 Jun 2024 2:35 PM IST
ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు ( CM Chandrababu Naidu ) అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంటరీ పార్టీ నేతను సమావేశంలో ఎన్నుకునే అవకాశముంది. ఎన్డీఏలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి 16 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తే అంశాలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకు వచ్చేలా పార్లమెంటు సభ్యులు ప్రయత్నించాలని వారికి చెప్పనున్నారు. ఒక్కొక్కరికి కొన్ని బాధ్యతలను ఈ సమావేశంలో అప్పగించనున్నారని తెలిసింది. ఇద్దరు కేంద్రమంత్రులతో పాటు ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com