AP : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి బుల్లెట్ ప్రూఫ్ కారు

టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ( Palla Srinivasa Rao ) ఆ పార్టీ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉన్నందున సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) బుల్లెట్ ప్రూఫ్ కారుని ఆయనకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ(95,235)తో నెగ్గారు. గుడివాడ అమర్నాథ్పై ఈయన గెలిచారు.
2014-19 మధ్య శాసనసభ్యునిగా పనిచేశారు పల్లా శ్రీనివాసరావు. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి సింహాచలం 1984 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1994-99 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కార్మిక నాయకుడిగా టీడీపీ అనుబంధ విభాగం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్(టీఎన్టీయూసీ) ఏర్పాటులోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక శ్రీనివాసరావు, ఆయన కుటుంబ సభ్యులను అయిదేళ్లపాటు తీవ్రంగా వేధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com