AP : పోలీసులను మాపై ఉసిగొల్పుతున్నారు.. లోకేశ్ ఆరోపణ

AP : పోలీసులను మాపై ఉసిగొల్పుతున్నారు.. లోకేశ్ ఆరోపణ

AP : ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ పోలీసుల తీరును తప్పుపట్టారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh). ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. పోలీసులు తనిఖీల్లో బిజీగా ఉన్నారు. ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో నగదు తరలిస్తుంటే సీజ్ చేస్తున్నారు. ఏపీలో పోలీసుల వ్యవహారం ఏ మాత్రం సరిగ్గా లేదని నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనీ.. ప్రతిపక్షాల వాహనాలనే టార్గెట్‌గా చేసుకుని పోలీసులు తనిఖీలు చేస్తున్నారని నారా లోకేశ్ ఫైరయ్యారు. గుంటూరు ఎస్పీ కూడా టీడీపీ నేతలను ఇబ్బందులు పెడుతున్నారనీ.. టీడీపీ వారిని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నారని లోకేశ్ ఫైర్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీల వాహనాలు పోలీసులకు ఎందుకు కనిపించవని ప్రశ్నించారు. మంగళగిరి మొత్తం డ్రగ్స్‌ డెన్‌గా మారిందని ఆరోపించారు. పైనుంచి ఆదేశాలు రావడంతోనే ప్రతిపక్షాల వాహనాలను మాత్రమే తనిఖీ చేస్తున్నారని కింది సిబ్బంది చెబుతున్నారంటూ మండిపడ్డారు. పార్టీ అంతర్గత సమావేశంలో ఇంటెలిజెన్స్‌కు ఏం పని అంటూ అధికార పార్టీని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ డీజీపీపైనా కూడా ఆయన మండిపడ్డారు. డీజీపీకి టైమ్ దగ్గరపడిందని వార్నింగ్ ఇచ్చారు.

డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఐజీని సస్పెండ్ చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. వారు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఐజీపై చర్యలు తీసుకునేవరకు ఫైట్ చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story