Car Accident : ప్రకాశంలో ఘోరం.. ముగ్గురు మహిళలు దుర్మరణం

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కారు బోల్తా పడి ముగ్గురి ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మహిళలు మృతిచెందారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద ఈ ఘటన జరిగింది.
ఖమ్మం జిల్లా పాల్వంచలో వివాహానికి హాజరై కందుకూరు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సూరారెడ్డి పాలెం రహదారిపై డివైడర్ ని కారు ఢీకొట్టింది. కారు వేగంగా ఉండటంతో ఢీకొట్టిన వెంటనే బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు స్పాట్ లోనే కన్నుమూశారు.
కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నెల్లూరు జిల్లా కందుకూరు వాసులుగా గుర్తించారు పోలీసులు. మృతులు గుల్లపల్లి శ్రావణి, కలపనేని దివ్య, రాయని అరుణగా గుర్తించారు పోలీసులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com