AP : షర్మిలకు బాబు స్వీట్ వార్నింగ్

AP : షర్మిలకు బాబు స్వీట్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. సీట్లు ఎన్ని సాధిస్తారన్నది కాకపోయినా.. ఆమె సొంత అన్నపై చేస్తున్న పొలిటికల్ ఫైట్ సంచలనం రేపుతోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మీద విరుచుకుపడుతూనే ఉన్నారు. అప్పుడప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. షర్మిల వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు చాలారోజుల తర్వాత స్పందించారు.

సీఎం జగన్ పై ఎప్పటిలాగే నెల్లూరు రా కదలిరా సభలోనూ చంద్రబాబు విమర్శలు చేశారు. జగన్ పరిస్థితి నచ్చక సొంత పార్టీ వారే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారని.. ఐదు కోట్ల ప్రజానీకం క్షేమం కోసం అందరూ ఆలోచించాలని కోరారు. ఇక చెల్లెలు షర్మిలకు అన్యాయం చేశాడని.. పాపం, ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వలేదని అన్నారు బాబు.

ఎన్నికల ముందు సొంత చెల్లెలితో పాదయాత్ర చేయించి, ఊరూరా తిప్పి జగన్ ఎలా ఉపయోగించుకున్నాడో అందరూ చూశారని బాబు కౌంటరిచ్చారు. బాత్రూంలో టిష్యూ పేపర్ ను విసిరేసినట్టు చెల్లెల్ని వదిలేశాడని చంద్రబాబు సెటైర్ వేశారు. "వైఎస్ షర్మిల ఇప్పుడు ఒక పార్టీలో చేరింది. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలైంది. అందుకే నేనేమీ మాట్లాడను. వాళ్ల అన్నపై ఉండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తోంది. మేమేమీ బాధపడడంలేదు. సమాధానం చెప్పుకునే సమర్థత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం షర్మిల కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది" అని షర్మిలకు సర్దిచెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story