Good News : పవన్ ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్‌లు

Good News : పవన్ ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్‌లు

AP : ఏపీలో ఇప్పుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరే ఎక్కడ చూసినా వినిపిస్తోంది. అటు సినిమాలు.. ఇటు ఎన్నికలు ఈ రెండు నెలల్లోనే రిలీజ్ కానున్నాయి. పదేళ్లుగా పవన్ పెంచుకున్న పొలిటికల్ మైలేజ్ కు ఇది పరీక్షగా నిలవబోతోంది. కూటమి కట్టించి టీడీపీని ముందుండి నడిపిస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈసారి ఇటు సినిమాలు.. అటు ఎన్నికలు రెండూ సూపర్ హిట్ అన్న అంచనాలో ఉన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎన్నో స్పెషల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న మూవీ ఉస్తాద్‌ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తాజాగా ఓ అప్డేట్ నెటింట వైరల్‌గా మారింది. ఈ నెల 19న ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ డైలాగ్స్ తో ఈ ఈ గ్లింప్స్ రూపొందుతున్నాయని జోరుగా నెటింట ప్రచారం సాగుతుంది. ఇక మైత్రి మూవీ ప్రొడ్యూసర్లు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలతో స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో శ్రీ లీలా హీరోయిన్ గా నటిస్తోంది. అమెజాన్ ప్రొడ్యూసర్స్ మీట్‌లో ఈ వీడియోను ప్లే చేస్తున్నారని సమాచారం. ఉస్తాద్‌ భగత్ సింగ్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందంటూ.. మరోపక్క వార్తలు జోరందుకున్నాయి.

ఓజీ సినిమా నుంచి బాలీవుడ్ ప్రముఖనట్లు ఇమ్రాన్ హష్మీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఓజీ మూవీ నుంచి కూడా గ్లింప్స్‌ రిలీజ్ కానున్నాయన్నాడు. ఆ గ్లింప్స్‌ పవన్ పాత్రకు సంబంధించిన గ్లింప్సా.. లేదా ఇమ్రాన్ హష్మీ పాత్రకు సంబంధించిన గ్లింప్సా అనే విషయాన్ని మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు. ఏదేమైనా.. రెండు మూవీ అప్ డేట్స్ తో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బాక్సాఫీస్ షేక్ చేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా తెరకెక్కిస్తే ఇది నిజంగానే జరగడం ఖాయం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story