Murder : కొడుకును చంపేందుకు తండ్రి సుపారీ

Murder : కొడుకును చంపేందుకు తండ్రి సుపారీ

మహారాష్ట్ర పుణెలో దారణం జరిగింది. కుమారుడిని హత్య చేసేందుకు ఐదుగురు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్న ఓ తండ్రిని పుణె క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. నిందితుడి కుమారుడైన ధీరజ్ అర్గాడే శివాజీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ కుట్ర బయటపడింది.

పుణెలో దినేశ్ చంద్ర అలియాస్ బాబాసాహెబ్ శంకరరావు అర్గాడే అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. దినేశ్ చంద్ర కుమారుడు ధీరజ్ అర్గాడే. దినేశ్ చంద్రకు, ఆయన కుమారుడు ధీరజ్ అర్గాడే కు మధ్య కోట్ల రూపాయల విలువైన ఆస్తికి సంబంధించిన యాజమాన్య వివాదాలు ఉన్నాయి. దాంతో, తన కుమారుడిని హత్య చేయించాలని దినేశ్ చంద్ర అర్గాడే నిర్ణయించుకున్నాడు.

కుమారుడు ధీరజ్ ను హత్య చేయడానికి కాంట్రాక్ట్ కిల్లర్లను సంప్రదించాడు. ఈ హత్య చేస్తే రూ. 75 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో రూ. 20 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడు. ఈ కుట్ర తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు కొడుకు ధీరజ్. దీంతో.. పోలీసులు సూత్రధారితో పాటు.. నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాటు తుపాకీ, లైవ్ రౌండ్, ఫుడ్ డెలివరీ బాయ్ టీషర్టులు, నకిలీ వాహన నంబర్ ప్లేట్ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story