TTD : తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల..ఇలా బుక్ చేసుకోండి

Tirumala కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళే తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల అయ్యాయి. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఉ.10గంటలకు ఆన్లైన్లో విడుదల అయ్యాయి. ఇక ఈ టికెట్ల కోసం Tirumala Tirupati Devasthanams (Official Website..https://www.tirumala.org/) వెబ్ సైట్ ను సందర్శించండి.
టీటీడీ అధికారిక ప్రకటనలో తెలిపినట్టుగానే ఇవాళ ఉదయం 10 గంటలకు టికెట్లు రిలీజ్ ప్రాసెస్ ను ప్రకటించింది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలకు లక్కిడిప్ విధానంలో పొందటానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రకటనలో తెలిపింది టీటీడీ. 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు లక్కిడిప్ విధానంలో టికెట్లను భక్తులు పొందొచ్చు. వాటిని ఆన్ లైన్ లో పేమెంట్ చేసి టికెట్లు పొందేందుకు గడువు ఉంటుంది. ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవా, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు విడుదల కానున్నాయి. వాటిని కూడా లక్కీ డిప్ లో పొంది ఆన్ లైన్ లో పేమంట్ చేయాల్సి ఉంటుంది.
ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం, 11 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చెయ్యనుంది టీటీడీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com