TG : బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయిందన్న కిషన్ రెడ్డి

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భారీ గెలుపు తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సికింద్రాబాద్ ఎంపీ విజేత కిషన్ రెడ్డి పార్టీ ప్రధాన ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. తాజా లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపికి మెజార్టీ సీట్లు ప్రజలు కట్టబెట్టారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా స్వతహాగా పోటీ చేసి తాము ఇన్ని సీట్లు గెలవలేదన్నారు. 8 సీట్లలో బిజెపిని గెలిపించి తెలంగాణ ప్రజలు మోడీని, బిజెపిని ఆశీర్వదించారని చెప్పారు.
భారతీయ జనతా పార్టీ గెలవని స్థానాల్లో కూడా గణనీయమైన ఓట్లను సాధించిందన్నారు కిషన్ రెడ్డి. రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేసినప్పటికీ తెలంగాణ ప్రజలు వాటిని నమ్మలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ లాగే కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలు నిరాశ నిస్పృహతో ఉన్నారనీ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అంకితభావంతో, నమ్మకంతో భారతీయత పార్టీ పనిచేస్తుందని చెప్పారు.
పదేళ్లపాటు అహంకార పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనీ.. బీఆర్ఎస్ కంచుకోటలా చెప్పుకునే మెదక్ స్థానంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com