AP : చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం ప్రారంభం

AP : చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం  ప్రారంభం

టీడీపీ చీఫ్ చంద్రబాబు (Chandrababu) నివాసంలో రాజశ్యామల యాగం ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరుగనుంది..చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు యాగ క్రతువులో పాల్గొన్నారు. 50మంది రుత్వికులు నిర్వహిస్తున్న ఈ యాగం .. ఆదివారం నిర్వహించే పూర్ణాహుతితో ముగుస్తుంది.

చంద్రబాబు కొద్దిరోజుల క్రితం శత చండి యాగం, మహా సుదర్శన హోమం చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేయడం తెలుగు రాష్ట్రాల్లో పరిపాటిగా మారింది. దీని వల్ల అధికారం దక్కుతుందని నేతల విశ్వాసం. గతంలోనూ కేసిఆర్, జగన్ రాజశ్యామల యాగం చేశారు.

ఎన్నికల వేళ చంద్రబాబు పూజలు చేపట్టడం పార్టీ విజయం కోసమేనని తెలుస్తోంది. తమ ప్రయత్నానికి దైవ అనుగ్రహం తోడయితే విజయం వరిస్తుందని ఆయన నమ్ముతున్నారు. అందువల్లే వరుసగా పూజలు, యాగాలు చేయిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ విజయకేతనం ఎగురవేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు యాగాల బాట పట్టారన్న టాక్‌ వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story