అన్న క్యాంటీన్ల మూసివేతను నిరసిస్తూ మాజీ మేయర్ బంగి అనంతయ్య వినూత్న నిరసన తెలిపారు.. స్థానికులతో కలిసి ఖాళీ ప్లేట్లతో ర్యాలీ నిర్వహించిన బంగి.. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట గుండు గీయించుకుని నిరసన తెలిపారు.. పేద ప్రజలకు తక్కువ ధరకే మూడు పూట్లా ఆహారం అందించాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని.. జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని మూసివేయడం దారుణమని అన్నారు.. జగన్ పేద ప్రజల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. అన్న క్యాంటీన్లను యధావిధిగా కొనసాగించాలని బంగి అనంతయ్య డిమాండ్ చేశారు.