సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని పేర్కొంది. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కేంద్రం.. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరించింది. ఇదులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
కాగా, ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్గా పనిచేయగా.. 2019 ఎన్నికల సమయంలో ఆయన్ను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ తర్వాత జగన్ సర్కార్ అధికారంలోకి రాగా.. నిఘా పరికరాల కొనుగోళ్ల విషయంలో ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఆయన కోర్టును ఆశ్రయించగా.. విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.. ఆ వెంటనే ఆయన సీఎస్ను కలిసి తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. అయితే మళ్లీ ఆయన్ను రెండోసారి కూడా సస్పెండ్ చేసింది ప్రభుత్వం.