AP : ఏపీలో ఆరోగ్యశ్రీకి నిధులు రూ.203కోట్లు విడుదల

Update: 2024-05-22 05:57 GMT

ఏపీలో ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం అత్యవసరంగా రూ.203కోట్లు విడుదల చేసింది. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రులు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్ నిధులపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం, ఆస్పత్రుల మధ్య జరుగుతున్న చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.

కాగా ఈ నిధులను అత్యవసరంగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గతంలో పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో దిగొచ్చిన సర్కార్ నిధులు విడుదల చేసినట్లు తెలుస్తుంది

గత ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.1,500 కోట్ల వరకు ఉంది. రూ.530 కోట్ల విలువైన బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఈ నెల 2న సీఈఓ చెపారు. ఇప్పటివరకు చెల్లించలేదు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సుమారు రూ.50 కోట్ల బిల్లుల చెల్లింపులే జరిగాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించాం’ అని పేర్కొంది.

Tags:    

Similar News