AP: ఏపీ­కి రూ.45 వేల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు

సింగపూర్ పర్యటన విజయవంతం... ఏపీలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు;

Update: 2025-08-01 02:30 GMT

సీఎం చం­ద్ర­బా­బు సిం­గ­పూ­ర్‌ పర్య­టన వి­జ­య­వం­త­మైం­ద­ని, ఐదే­ళ్ల­లో రూ.45 వేల కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­కు ఒప్పం­దా­లు కు­ది­రా­య­ని మం­త్రి నారా లో­కే­శ్‌ తె­లి­పా­రు. సిం­గ­పూ­ర్‌ పర్య­టన అనం­త­రం ఏపీ­కి వచ్చిన మం­త్రి నారా లో­కే­ష్ గు­రు­వా­రం రా­ష్ట్ర సచి­వా­ల­యం­లో మీ­డి­యా­తో మా­ట్లా­డా­రు. ఈ సం­ద­ర్భం­గా ఆయన మా­ట్లా­డు­తూ సిం­గ­పూ­ర్‌ పర్య­టన సక్సె­స్ అయిం­ద­ని, మొ­త్తం రూ.45 వేల కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­కు ఒప్పం­దా­లు కు­ది­రా­య­ని మం­త్రి నారా లో­కే­శ్‌ తె­లి­పా­రు. రా­ష్ట్ర అభి­వృ­ద్ధి­ని పరు­గు­లు పె­ట్టిం­చా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు అన్ని ప్ర­య­త్నా­లు చే­స్తు­న్నా­ర­ని, అం­దు­లో భా­గం­గా­నే ఈ ప్ర­త్యేక పర్య­టన జరి­గిం­ద­ని తె­లి­పా­రు. అయి­తే అం­ద­రి­లా “మేము ఎం­వో­యూ­లు కు­దు­ర్చు­కో­వ­డం లేదు. ఒప్పం­దా­ల్ని నే­రు­గా అమలు చేసే దశకు తీ­సు­కొ­స్తు­న్నాం,” అని లో­కే­శ్‌ అన్నా­రు. పె­ట్టు­బ­డుల కోసం జూ­మ్‌­కా­ల్‌ ద్వా­రా ఆర్సె­ల­ర్‌ మి­త్త­ల్‌­ను స్వ­యం­గా ఆహ్వా­నిం­చా­మ­ని చె­ప్పా­రు. దే­శం­లో అతి­పె­ద్ద స్టీ­ల్‌­ప్లాం­ట్‌, డేటా సెం­ట­ర్ల­ను ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో ఏర్పా­టు చే­య­బో­తు­న్న­ట్లు తె­లి­పా­రు. ఏపీకి పెట్టుబడులు రాకుండా సింగపూర్‌ అధికారులకు మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్‌ పంపించారు. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని అందులో పేర్కొన్నారు. మురళీకృష్ణకు వైసీపీ నేతలతో సంబంధాలున్నాయి. పెట్టుబడుల కోసం తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే కలిసికట్టుగా పనిచేస్తాయని లోకేశ్ అన్నారు.

ఏపీ బ్రాండ్‌ నాశనం

“2019 నుం­చి 2024 మధ్య జగ­న్‌ పా­ల­న­లో ఏపీ బ్రాం­డ్‌ పూ­ర్తి­గా దె­బ్బ­తి­న్న పరి­స్థి­తి ఉంది. అమ­రా­వ­తి­ని కలి­సి అభి­వృ­ద్ధి చే­ద్దా­మ­ని సిం­గ­పూ­ర్‌ ప్ర­భు­త్వ­మే ముం­దు­కు వచ్చిం­ది. కానీ, అప్ప­టి ప్ర­భు­త్వం సిం­గ­పూ­ర్‌­తో ఉన్న ఒప్పం­దా­ల్ని ని­ర్ల­క్ష్యం­గా రద్దు చే­సిం­ది. పా­ర­ద­ర్శ­క­త­కు పే­రు­గాం­చిన దే­శ­మైన సిం­గ­పూ­ర్‌­పై అవి­నీ­తి ఆరో­ప­ణ­లు మో­పా­రు. అమ­ర్‌­రా­జా, లులు వంటి కం­పె­నీ­ల­ను రా­ష్ట్రం నుం­చి వె­ళ్ళ­గొ­ట్టా­రు. అయి­నా ఏపీ­కే అదృ­ష్టం­గా చం­ద్ర­బా­బు గారు ఉన్నా­రు. బెం­గ­ళూ­రు­కు కర్ణా­టక, చె­న్నై­కి తమి­ళ­నా­డు, ఇక ఐటీ రంగ అభి­వృ­ద్ధి­కి వి­శా­ఖ­ప­ట్నం­ను కేం­ద్రం­గా తీ­ర్చి­ది­ద్దా­ల­ని ని­ర్ణ­యం తీ­సు­కు­న్నాం,” అన్నా­రు లో­కే­శ్‌. ఏ రా­ష్ట్రం ఇవ్వ­ని వి­ధం­గా టీ­సీ­ఎ­స్‌­కు ఎకరా రూ.99పై­స­ల­కే భూమి కే­టా­యిం­చా­మ­ని లో­కే­శ్ అన్నా­రు. దీ­ని­పై వై­సీ­పీ నే­త­లు కో­ర్టు­కె­ళ్లా­ర­ని... తక్కువ ధరకు భూ­ము­ల్ని మేం హె­రి­టే­జ్‌­కు కూడా ఇవ్వ­లే­ద­ని... టీ­సీ­ఎ­స్‌­కు ఇచ్చా­మ­న్నా­రు. ఉద్యో­గా­లు వస్తా­య­ని రూ.99పై­స­ల­కే భూ­ము­లు ఇస్తు­న్నాం. అం­దు­లో తప్పేం­ట­ని ప్ర­శ్నిం­చా­రు.

Tags:    

Similar News