AP: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు

ఎస్పీలకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Update: 2025-09-14 03:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో ఐపీ­ఎ­స్ అధి­కా­రు­ల­ను ప్ర­భు­త్వం బది­లీ చే­సిం­ది. 14 జి­ల్లా­ల­కు కొ­త్త ఎస్పీ­ల­ను ని­య­మి­స్తూ ప్ర­భు­త్వ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి కె. వి­జ­యా­నం­ద్ ఆదే­శా­లు జారీ చే­శా­రు. ఏడు జి­ల్లా­ల­కు ఎస్పీ­లు­గా కొ­త్త అధి­కా­రు­ల­ను ని­య­మిం­చా­రు. అలా­గే మరో ఏడు జి­ల్లా­ల­కు ఇతర జి­ల్లాల ఎస్పీ­ల­ను బది­లీ చే­శా­రు. అదే వి­ధం­గా 12 జి­ల్లా­ల్లో ఉన్న వా­రి­నే ఎస్పీ­లు­గా కొ­న­సా­గి­స్తు­న్న­ట్లు సీ­ఎ­స్ జారీ చే­సిన ఉత్త­ర్వు­ల్లో స్ప­ష్టం చే­శా­రు. ఇటీ­వల ఐఏ­ఎ­స్ అధి­కా­రుల బది­లీ­లు చే­ప­ట్టిన ప్ర­భు­త్వం.. తా­జా­గా ఐపీ­ఎ­స్ అధి­కా­రుల బది­లీ­లు చే­ప­ట్టిం­ది. గుం­టూ­రు ఎస్పీ­గా వకు­ల్ జిం­దా­ల్, తి­రు­ప­తి ఎస్పీ­గా సు­బ్బా­రా­యు­డు, కడప ఎస్పీ­గా నచి­కే­త్, కృ­ష్ణా జి­ల్లా ఎస్పీ­గా వి­ద్యా­సా­గ­ర్ నా­యు­డు­ల­ను ని­య­మి­స్తూ ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది.

అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు, అన­కా­ప­ల్లి, పా­ర్వ­తీ­పు­రం మన్యం, శ్రీ­కా­కు­ళం, వి­శా­ఖ­ప­ట్నం, తూ­ర్పు గో­దా­వ­రి, ఏలూ­రు, కా­కి­నాడ, ఎన్టీ­ఆ­ర్, పశ్చిమ గో­దా­వ­రి, అనం­త­పు­రం, కర్నూ­లు జి­ల్లాల ఎస్పీ­లు యథా­త­థం­గా ఆయా జి­ల్లా­ల్లో­నే కొ­న­సా­గ­ను­న్నా­రు. మరో­వై­పు తి­రు­ప­తి ఎస్పీ­గా సు­బ్బా­రా­యు­డు మరో­సా­రి ని­య­మి­తు­ల­య్యా­రు. తి­రు­ప­తి­లో తొ­క్కి­స­లాట ఘటన తర్వాత ఎస్పీ­గా ఉన్న సు­బ్బా­రా­యు­డు బది­లీ అయ్యా­రు. అయి­తే మరో­సా­రి ఆయ­న­కు తి­రు­ప­తి జి­ల్లా ఎస్పీ­గా అవ­కా­శం కల్పిం­చా­రు. తి­రు­ప­తి ఎస్పీ­గా­ఉ­న్న హర్ష­వ­ర్ధ­న్ రా­జు­ను ప్ర­కా­శం జి­ల్లా­కు బది­లీ చే­శా­రు. ఇటీ­వల టీ­టీ­డీ ఈవో దగ్గర నుం­చి సీ­ని­య­ర్ ఐఏ­ఎ­స్ అధి­కా­రుల బది­లీ­లు చే­ప­ట్టిన ప్ర­భు­త్వం.. ఆ తర్వాత జి­ల్లా కలె­క్ట­ర్ల­ను బది­లీ చే­సిం­ది.

చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో భా­రీ­గా ఐపీ­ఎ­స్‌ అధి­కా­రు­ల­ను కూ­ట­మి ప్ర­భు­త్వం బది­లీ చే­సిం­ది. ఈ బది­లీల తర్వాత జి­ల్లా ఎస్పీ­ల­తో సమా­వే­శ­మైన సీఎం చం­ద్ర­బా­బు... వా­రి­కి కీలక ఆదే­శా­లు ఇచ్చా­రు. శాం­తి భద్ర­త­ల­కు ప్రా­ధా­న్య­మి­వ్వా­ల­ని సూ­చిం­చా­రు. రా­ష్ట్రా­ని­కి పె­ట్టు­బ­డు­లు రా­వా­లం­టే శాం­తి భద్ర­త­లే కీ­ల­క­మ­ని చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. రా­జ­కీయ ము­సు­గు­లో నే­రా­ల­ను ఉపే­క్షిం­చ­వ­ద్ద­ని ఆదే­శిం­చా­రు.. వై­ఎ­స్‌ వి­వే­కా­నం­ద­రె­డ్డి హత్య, సిం­గ­య్య మృతి కేసు స్ట­డీ­లు­గా చూ­డా­ల­ని సూ­చిం­చా­రు. ఇన్వె­స్టి­గే­ష­న్‌­లో టె­క్నా­ల­జీ­తో బె­స్ట్ రి­జ­ల్ట్ చూ­పిం­చ­వ­చ్చు అన్నా­రు.. రి­యా­క్ట్, రీచ్, రె­స్పాం­డ్, రి­జ­ల్ట్ వి­ధా­నం పా­టిం­చం­డి అని ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. ప్ర­జ­ల­తో ఫ్రెం­డ్లీ­గా ఉం­డా­లి.. అదే సమ­యం­లో అసాం­ఘిక శక్తు­లు భయ­ప­డే­లా పని చే­యా­ల­ని స్ప­ష్టం చే­శా­రు. "సో­ష­ల్‌ మీ­డి­యా పో­స్టు­ల­పై ఫో­క­స్‌ పె­ట్టం­డి.. సో­ష­ల్ మీ­డి­యా సై­కో­ల­ను కట్ట­డి చే­యం­డి" ఎస్పీ­ల­కు ము­ఖ్య­మం­త్రి స్ప­ష్ట­మైన ఆదే­శా­లు జారీ చే­శా­రు.

Tags:    

Similar News