AP: ఏపీలో రేవంత్ వ్యాఖ్యల కలకలం

రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ సర్కార్.. రాజకీయ లబ్ధి కోసమే వ్యాఖ్యలన్న ఏపీ.. సీమ నీటి విషయంలో రాజీ ఉండదని స్పష్టం

Update: 2026-01-04 09:30 GMT

తె­లం­గాణ శా­స­న­సభ శీ­తా­కాల సమా­వే­శాల సం­ద­ర్భం­గా ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి చే­సిన వ్యా­ఖ్య­లు... ఇప్పు­డు ఏపీ­లో తీ­వ్ర కల­క­లం రే­పు­తు­న్నా­యి. సభలో ఇరి­గే­ష­న్ ప్రా­జె­క్టుల మీద చర్చ సమ­యం­లో మా­ట్లా­డిన రే­వం­త్ ఏపీ సీఎం చం­ద్ర­బా­బు­తో తనకు జరి­గిన క్లో­జ్ రూమ్ సం­భా­షణ గు­రిం­చి ప్ర­స్తా­విం­చా­రు. జగన్ ప్ర­భు­త్వం రా­య­ల­సీమ లి­ఫ్ట్ ఇరి­గే­ష­న్ ప్రా­జె­క్ట్ చే­ప­ట్టిం­ద­ని, ప్ర­తి రోజు 3 టీ­ఎం­సీల నీ­టి­ని వి­ని­యో­గిం­చా­ల­ని అను­కుం­ద­ని రే­వం­త్ చె­ప్పా­రు. అయి­తే, ఆ తర్వాత కూ­ట­మి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిం­ద­ని, ఏదైన వి­ష­యాల మీద చర్చ జర­గా­లం­టే రా­య­ల­సీమ లి­ఫ్ట్ ఇరి­గే­ష­న్ పను­లు ఆపా­ల­ని తాను చం­ద్ర­బా­బు­ను కో­రా­న­ని రే­వం­త్ అన్నా­రు. తమ మీద గౌ­ర­వం­తో రా­య­ల­సీమ లి­ఫ్ట్ ఇరి­గే­ష­న్ పను­ల­ను చం­ద్ర­బా­బు ఆపే­శా­ర­ని, అది తాను సా­ధిం­చిన వి­జ­య­మ­ని అన్నా­రు.

రా­య­ల­సీమ లి­ఫ్ట్ పను­లు ఆగా­యా లేదా వె­ళ్లి చూ­సు­కో­వా­ల­ని, కే­సీ­ఆ­ర్ లేదా హరీ­ష్ రా­వు­ల­తో ని­జ­ని­ర్ధా­రణ కమి­టీ వే­యా­ల­ని కో­రా­రు. జగన్ ను ఇం­టి­కి పి­లి­చి పం­చ­భ­క్ష పర­వా­ణ్ణా­లు పె­ట్టి రా­య­ల­సీమ లి­ఫ్ట్ ఇరి­గే­ష­న్ కు 3 టీ­ఎం­సీ­లు ఇచ్చి కమి­ష­న్లు తీ­సు­కు­న్న చరి­త్ర వా­ళ్ల­ద­ని కే­సీ­ఆ­ర్, హరీ­ష్ లను­ద్దే­శిం­చి సం­చ­లన ఆరో­ప­ణ­లు చే­శా­రు. జగన్ ను భుజం తట్టి వె­న్ను తట్టి ప్రో­త్స­హిం­చా­ర­ని చె­ప్పా­రు. వారి చరి­త్ర అదని, వారి నీతి అది అని అన్నా­రు.

ఖండించిన ఏపీ సర్కార్

సీఎం రే­వం­త్‌­రె­డ్డి వ్యా­ఖ్య­ల­ను ఏపీ ప్ర­భు­త్వం ఖం­డిం­చిం­ది. తె­లం­గాణ ప్ర­యో­జ­నాల కోసం పను­లు ని­లి­పి­వే­శా­ర­న్న రే­వం­త్‌ వ్యా­ఖ్య­ల­ను తప్పు­ప­ట్టిం­ది. రే­వం­త్‌­రె­డ్డి చే­సిన వ్యా­ఖ్య­లు అసం­బ­ద్ధ­మ­ని పే­ర్కొం­ది. చం­ద్ర­బా­బు కేం­ద్రం­గా తె­లం­గా­ణ­లో అధి­కార, వి­ప­క్షా­లు రా­జ­కీయ లబ్ధి పొం­దే ప్ర­య­త్నం చే­స్తు­న్న­ట్లు ఆరో­పిం­చిం­ది. ఏపీ నీటి హక్కు­లు, సీమ సా­గు­నీ­టి ప్ర­యో­జ­నాల వి­ష­యం­లో రాజీ ఉం­డ­బో­ద­ని తె­లి­పిం­ది. ‘‘జగ­న్‌ హయాం­లో అను­మ­తు­లు లే­కుం­డా రా­య­ల­సీమ లి­ఫ్ట్‌ ప్రా­జె­క్టు పను­లు చే­ప­ట్టా­రు. సీ­మ­కు రో­జు­కు 3 టీ­ఎం­సీ­లం­టూ ప్ర­క­ట­న­ల­తో జగ­న్‌ ప్ర­భు­త్వం పను­లు చే­ప­ట్టిం­ది. జగ­న్‌ ప్ర­చా­రం­తో లి­ఫ్ట్‌ పను­ల­పై తె­లం­గాణ ప్ర­భు­త్వం కో­ర్టు­లో కే­సు­లు వే­సిం­ది. కేం­ద్రం, ఎన్‌­జీ­టీ­తో పాటు పలు­చో­ట్ల ఫి­ర్యా­దు చే­సిం­ది. తె­లం­గాణ ఫి­ర్యా­దు­ల­ను వి­చా­రిం­చి.. అను­మ­తు­లు లే­నం­దున పను­లు ని­లి­పి­వే­యా­ల­ని 2020లోనే ఎన్‌­జీ­టీ, కేం­ద్రం ఆదే­శా­లు ఇచ్చిం­ది. కూ­ట­మి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి రా­క­ముం­దే కేం­ద్రం పను­ల­ను ని­లి­పి­వే­యిం­చిం­ది’’ అని ఏపీ ప్ర­భు­త్వం తె­లి­పిం­ది.

Tags:    

Similar News