PERNI: పేర్ని నానికి అరెస్ట్‌ వారెంట్ జారీ

Update: 2025-06-17 03:00 GMT

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన్ను పలు కేసుల్లో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఊహించని రీతిలో ఓ చిన్న కేసులో ఆయనపై ఆరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ మచిలీపట్నం కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో పేర్ని నాని తప్పనిసరిగా కోర్టులో హాజరుకావాలి. పేర్ని నాని గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చందు శ్రీహర్ష అనే టీడీపీ కార్యకర్తపై నమోదైన కేసులో సాక్షిగా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. కోర్టు వాయిదాలకు సాక్షిగా ఉన్న పేర్నినాని హాజరు కావడం లేదు. దీంతో పలుమార్లు వేచి చూసిన న్యాయస్థానం.. సోమవారం పేర్నినానిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. ఇప్పటికే తనపై నమోదైన కేసుల్లో కాకుండా తాను సాక్షిగా ఉన్న కేసులో పేర్నినానిపై ఇలా వారెంట్ జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags:    

Similar News