Avanthi Srinivasa Rao: దిగొచ్చిన అవంతి శ్రీనివాస్.. టీవీ5 ప్రతినిధికి క్షమాపణలు..

Avanthi Srinivasa Rao: రైతు భరోసా కేంద్రంలో రెచ్చిపోయిన ఎట్టకేలకు ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దిగొచ్చారు.

Update: 2022-05-21 15:30 GMT

Avanthi Srinivasa Rao: రైతు భరోసా కేంద్రంలో రెచ్చిపోయిన ఎట్టకేలకు ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దిగొచ్చారు. అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో మా టీవీ-5 ప్రతినిధికి అవంతి క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభాలు దెబ్బ తీయాలని తన ఉద్దేశ్యం కాదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు.

ఈనెల 16న విశాఖలోని కొరడా రైతు భరోసా కార్యక్రమంలో అవంతి రెచ్చిపోయారు. భీమిలీ టీవీ-5 రిపోర్టర్‌ను దూషించారు. కవరేజ్‌కు వెళ్లిన రిపోర్టర్‌ను.. పంతులు నీ సంగతి చూస్తానంటూ బెదిరించారు. దీంతో అవంతి శ్రీనివాస్‌ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాయి. టీడీపీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి.

Tags:    

Similar News