CBN: రైతుల పేరుతో రాజకీయాలు చేస్తే తాట తీస్తా: చంద్రబాబు

Update: 2025-09-04 05:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని అన్ని జి­ల్లా­ల్లో ఎరు­వు­లు అం­దు­బా­టు­లో ఉన్నా­య­ని ఏపీ సీఎం చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. కొం­ద­రు కా­వా­ల­నే యూ­రి­యా­ను దారి మళ్లి­స్తు­న్నా­ర­ని... దారి మళ్లిం­చిన వా­రి­పై కే­సు­లు నమో­దు చే­శా­మ­ని, రూ.3కో­ట్ల వి­లు­వైన యూ­రి­యా­ను స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­మ­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ఫే­క్‌ పా­ర్టీ, నే­రా­ల­ను నమ్ము­కు­న్న పా­ర్టీ ఎరు­వు­ల­పై విష ప్ర­చా­రం చే­స్తోం­ద­ని చం­ద్ర­బా­బు వి­మ­ర్శిం­చా­రు. సకా­లం­లో యూ­రి­యా, ఎరు­వు­లు సర­ఫ­రా చే­య­డ­మే తమ లక్ష్య­మ­ని ము­ఖ్య­మం­త్రి స్ప­ష్టం చే­శా­రు. యూ­రి­యా­కు సం­బం­ధిం­చి ఎవరూ ఆం­దో­ళన చెం­ద­వ­ద్ద­న్నా­రు. "ఏపీ­లో నే­ర్థు­లు ఎక్కు­వ­య్యా­రు. కృ­ష్ణా జి­ల్లా­లో యూ­రి­యా లా­రీ­ని వై­కా­పా నేత అడ్డు­కొ­ని వి­వా­దం చే­శా­డు. రై­తుల ము­సు­గు­లో వై­కా­పా కా­ర్య­క­ర్త­లు రా­జ­కీ­యా­లు చే­స్తే ఖబ­డ్దా­ర్‌. వి­శాఖ స్టీ­ల్‌­ప్లాం­ట్‌­ను ప్రై­వే­టీ­క­రణ చే­స్తా­ర­ని ఎవరు చె­ప్పా­రు?ప్లాం­ట్‌ సమ­ర్థ­త­ను పెం­చ­డా­ని­కి కొ­న్ని సర్వీ­సు­ల­ను ఔట్‌­సో­ర్సిం­గ్‌ చే­స్తా­రు. వి­శాఖ స్టీ­ల్‌­ప్లాం­ట్‌­కు రూ.12వేల కో­ట్లు ని­ధు­లు వచ్చా­యి. ఔట్‌­సో­ర్సిం­గ్‌ నె­పం­తో ఇష్టా­ను­సా­రం­గా మా­ట్లా­డు­తు­న్నా­రు.” అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

టీడీపీ ఫోరమ్‌'కు లోకేశ్ అభినందనలు

'బెం­గ­ళూ­రు టీ­డీ­పీ ఫో­ర­మ్' నేడు 12 వసం­తా­లు పూ­ర్తి చే­సు­కుం­ది. ఈ సం­ద­ర్భం­గా వా­రి­కి మం­త్రి నారా లో­కే­శ్ హృ­ద­య­పూ­ర్వక శు­భా­కాం­క్ష­లు తె­లి­పా­రు. మా­తృ­భూ­మి అభ్యు­న్న­తి కోసం, తె­లు­గు­దే­శం పా­ర్టీ­ని బలో­పే­తం చే­య­టం కోసం ని­రం­త­రం చే­స్తు­న్న కృషి చే­స్తు­న్న 'బెం­గ­ళూ­రు టీ­డీ­పీ ఫో­ర­మ్' సే­వ­లు అభి­నం­ద­నీ­య­మ­న్నా­రు. స్వ­రా­ష్ట్రం స్వ­ర్ణాం­ధ్ర­గా వి­రా­జి­ల్లా­ల­నే వారి కలలు వి­జ­య­వం­తం కా­వా­ల­ని ఆకాం­క్షి­స్తు­న్నా­న­ని ట్వీ­ట్ చే­శా­రు. టీడీపీ బలోపేతంలో వీరి కృషి ఎంతో ఉందన్నారు.

టీటీడీ ఆస్పత్రుల్లో సేవ చేసేందుకు అవకాశం

తి­రు­మ­ల­లో­ని బి­గ్‌ క్యాం­టీ­న్లు, జనతా క్యాం­టీ­న్ల­కు టెం­డ­ర్లు పి­లు­స్తా­మ­ని తి­రు­మల తి­రు­ప­తి దే­వ­స్థా­నం ఛై­ర్మ­న్‌ బీ­ఆ­ర్‌ నా­యు­డు తె­లి­పా­రు. భక్తు­ల­కు మరింత రు­చి­క­ర­మైన ఆహా­రం అం­దిం­చా­ల­ని ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్టు చె­ప్పా­రు. గతం­లో క్యాం­టీ­న్ల ని­ర్వా­హ­కు­లు ఇష్టా­రా­జ్యం­గా వ్య­వ­హ­రిం­చ­డం­తో భక్తు­లు తీ­వ్ర అసౌ­క­ర్యా­ని­కి గు­ర­య్యా­ర­ని గు­ర్తు చే­శా­రు. టీ­టీ­డీ ఆధ్వ­ర్యం­లో­ని ఆస్ప­త్రు­ల్లో సేవ చే­సేం­దు­కు భక్తు­ల­కు అవ­కా­శం కల్పి­స్తు­న్న­ట్లు బీ­ఆ­ర్‌ నా­యు­డు తె­లి­పా­రు. ఆస్ప­త్రు­ల్లో సేవ చే­యా­ల­ను­కు­నే భక్తు­ల­కు ‘శ్రీ­వా­రి సేవ ట్రై­న­ర్‌’ పే­రు­తో మూ­డ్రో­జు­ల­పా­టు శి­క్షణ ఇస్తా­మ­న్నా­రు. ఈ సేవ చే­య­డా­ని­కి వచ్చే భక్తు­ల­కు కనీ­సం డి­గ్రీ వి­ద్యా­ర్హత ఉం­డా­ల­ని చె­ప్పా­రు. సే­వ­కు­ల­కు శి­క్షణ ఇచ్చేం­దు­కు ప్ర­త్యేక కా­ర్య­క్ర­మం ని­ర్వ­హిం­చ­ను­న్న­ట్టు తె­లి­పా­రు. తి­రు­ప­తి­లో­ని స్వి­మ్స్‌, బర్డ్‌ ఆసు­ప­త్రు­ల్లో­నూ వారి సే­వ­లు వి­ని­యో­గిం­చు­కుం­టా­మ­న్నా­రు. వి­దే­శాల నుం­చి చాలా మంది భక్తు­లు శ్రీ­వా­రి సే­వ­కు ముం­దు­కొ­స్తు­న్నా­ర­ని, ఎన్‌­ఆ­ర్‌ఐ భక్తుల సే­వ­లు కూడా వి­ని­యో­గిం­చు­కుం­టా­మ­ని తె­లి­పా­రు.

Tags:    

Similar News