CBN: చెత్తనే కాదు... చెత్త రాజకీయాలను తొలగిస్తాం

మాచర్లలో పర్యటించిన సీఎం చంద్రబాబు... స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న సీఎం... చీపురు పట్టి శుభ్రం చేసిన చంద్రబాబు

Update: 2025-09-21 03:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో చె­త్త రా­జ­కీ­యా­ల­ను కడి­గే­స్తా­న­ని సీఎం చం­ద్ర­బా­బు హె­చ్చి­రిం­చా­రు. మా­చ­ర్ల­లో సర్ణాం­ధ్ర-స్వ­చ్ఛాం­ధ్ర కా­ర్య­క్ర­మం­లో సీఎం పా­ల్గొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా సీఎం చం­ద్ర­బా­బు మా­ట్లా­డు­తూ.. మా­చ­ర్ల­లో చా­లా­కా­లం ప్ర­జా­స్వా­మ్యం లే­కుం­డా­పో­యిం­ద­ని అన్నా­రు. కొం­ద­రు నే­త­లు రౌ­డీ­యి­జం­తో వి­ధ్వం­సం చే­శా­ర­ని కా­మెం­ట్ చే­శా­రు. ని­యో­జ­క­వ­ర్గం­లో చాలా అరా­చ­కా­లు జరి­గా­య­ని.. ము­న్సి­ప­ల్ ఎన్ని­కల సం­ద­ర్భం­గా టీ­డీ­పీ నే­త­లు, కా­ర్య­క­ర్త­ల­పై దాడి చే­శా­ర­ని ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు.పల్నా­డు వై­సీ­పీ నే­త­ల­ను ఖబ­డ్దా­ర్ జా­గ్ర­త్త­గా ఉం­డా­లం­టూ చం­ద్ర­బా­బు హె­చ్చ­రిం­చా­రు. రౌ­డీ­యి­జం, నే­రా­లు, ఘో­రా­లు చే­స్తే చూ­స్తూ ఊరు­కో­న­ని వా­ర్నిం­గ్ ఇచ్చా­రు. ప్ర­జ­ల­పై వై­సీ­పీ నే­త­లు దా­డు­లు చే­స్తే సహిం­చే­ది లే­ద­ని హె­చ్చ రిం­చా­రు. ప్ర­జల ఆస్తు­ల­కు రక్ష­ణ­గా ని­ల­బ­డ­దా­మ­ని పి­లు­పు­ని­చ్చా­రు. చె­త్త పన్ను తొ­ల­గిం­చ­డం తో­పా­టు చె­త్త రా­జ­కీ­యా­ల­నూ క్లీ­న్‌ చే­స్తా­మ­ని తె­లి­పా­రు. పల్నా­డు­లో రౌ­డీ­యి­జా­న్ని అణ­చి­వే­స్తా­న­ని చె­ప్పు­కొ­చ్చా­రు. చె­త్త­నే కాదు.. చె­త్త రా­జ­కీ­యా­ల­ను కూడా తొ­ల­గి­స్తా­న­ని తె­లి­పా­రు.

ఫ్యాక్షనిజం లేకుండా చేశాం

తాము అధికారంలోకి రాగానే రాయసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేశానని అన్నారు. ఇక నుంచి పల్నాడులో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను 2014 నాటి సీఎంను కాదని.. 1995 నాటి సీఎంను అంటూ హెచ్చరించారు. గత ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేసిందని.. చెత్తను కూడా తొలగించలేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తూనే చెత్త మీద పన్ను తొలగించామని.. చెత్తను లేకుండా చేశామని తెలిపారు. చెత్తను మాత్రమే కాదు.. రాబోయే రోజుల్లో చెత్త రాజకీయాలను కూడా కడిగేస్తానని సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు.

మరో రెండు నదుల అనుసంధానం

శ్రీ­కా­కు­ళం­లో ఉన్న వం­శ­ధా­ర­ను, గో­దా­వ­రి, కృ­ష్ణా, రా­య­ల­సీ­మ­లో పె­న్నా నది­ని అను­సం­ధా­ని­స్తా­మ­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. పల్నా­డు జి­ల్లా­లో తల­స­రి ఆదా­యం తక్కువ ఉం­ద­ని, అన్ని ప్రాం­తా­ల­తో సమా­నం­గా మా­చ­ర్ల, గు­ర­జా­ల­ను అభి­వృ­ద్ధి చే­స్తా­మ­న్నా­రు. జల్ జీ­వ­న్ మి­ష­న్ ద్వా­రా మూ­డే­ళ్ల­లో ఇం­టిం­టి­కీ కు­ళా­యి­తో తా­గు­నీ­రు అం­ది­స్తా­మ­ని పే­ర్కొ­న్నా­రు. పల­నా­డు జీ­వ­నా­డి వరి­కె­పు­డి­శెల ప్రా­జె­క్టు­ను పూ­ర్తి చేసే బా­ధ్య­త­ను తీ­సు­కుం­టా­మ­ని హామీ ఇచ్చా­రు. 1.25 లక్ష ఎక­రా­ల­కు నీరు అం­దు­తుం­ది. మరో లక్ష మం­ది­కి తా­గు­నీ­రు అం­ది­స్తా­మ­ని చె­ప్పా­రు. మొ­ద­టి దశలో 1.45 టీ­ఎం­సీ­లు, రెం­డో దశలో 6.3 టీ­ఎం­సీల సా­మ­ర్ధ్యం­తో ప్రా­జె­క్టు పూ­ర్తి చే­స్తా­మ­న్నా­రు. రా­ష్ట్రా­ని­కి వరం పో­ల­వ­రం. గతం­లో మేం 76 శాతం పూ­ర్తి చే­స్తే ఐదే­ళ్ల­లో ఒక వ్య­క్తి వచ్చి వి­ధ్వం­సం చే­శా­డ­ని చె­ప్పా­రు. ప్ర­జా­వే­ది­క­తో వి­ధ్వం­సం మొ­ద­లు పె­ట్టి పో­ల­వ­రం­లో డయా­ఫ్రాం వాల్ కొ­ట్టు­కు­పో­యే­లా చే­శా­డ­ని తె­లి­పా­రు. కూ­ట­మి అధి­కా­రం­లో­కి వచ్చాక పో­ల­వ­రం పు­న­ర్ని­ర్మా­ణం చే­ప­ట్టా­మ­ని, 2027 నా­టి­కి పో­ల­వ­రం పూ­ర్తి చేసి జా­తి­కి అం­కి­తం చే­స్తా­మ­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు.

చీపురు పచ్చిన చంద్రబాబు


పల్నా­డు జి­ల్లా మా­చ­ర్ల­లో ని­ర్వ­హిం­చిన స్వ­ర్ణాం­ధ్ర-స్వ­చ్ఛాం­ధ్ర కా­ర్య­క్ర­మం­లో సీఎం చం­ద్ర­బా­బు పా­రి­శు­ద్ధ్య కా­ర్మి­కు­ల­తో కలి­సి చె­రు­వు వద్ద చె­త్త­ను ఊడ్చా­రు. అనం­త­రం కా­ర్మి­కు­ల­తో మా­ట్లా­డి వారి సమ­స్య­ల­ను అడి­గి తె­లు­సు­కు­న్నా­రు. మా­ర్గ­ద­ర్శి- బం­గా­రు కు­టుం­బాల సభ్యు­ల­తో సమా­వే­శం అయ్యా­రు.

పన్నుల భారం తగ్గింది

జీ­ఎ­స్టీ సం­స్క­ర­ణల వల్ల పన్నుల భారం తగ్గిం­ద­ని, ప్ర­జ­ల్లో కొ­ను­గో­లు శక్తి పె­రి­గిం­ద­ని సీఎం అన్నా­రు. ఇకపై కా­ర్యా­ల­యాల చు­ట్టూ తి­ర­గా­ల్సిన అవ­స­రం లే­కుం­డా వా­ట్స­ప్ ద్వా­రా­నే ప్ర­భు­త్వ సే­వ­లు అం­దు­బా­టు­లో­కి వస్తా­య­ని చె­ప్పా­రు. ఆరో­గ్య రం­గం­లో పె­ద్ద ఎత్తున మా­ర్పు­లు తె­స్తా­మ­ని చం­ద్ర­బా­బు ప్ర­క­టిం­చా­రు. సం­జీ­వ­ని ప్రా­జె­క్టు ప్రా­రం­భిం­చ­ను­న్న­ట్లు తె­లి­పా­రు. యూ­ని­వ­ర్స­ల్ హె­ల్త్ పథకం కింద ధనిక, పేద తేడా లే­కుం­డా అం­ద­రి­కీ రూ.2.5 లక్షల బీమా కల్పిం­చ­ను­న్న­ట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Tags:    

Similar News