CBN: టీడీపీ ఎమ్మెల్యేలకు టైమ్‌టేబుల్..!

సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం... ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై సీఎం ఫోకస్.. ఇప్పటికే 48 మంది ఎమ్మెల్యేలకు నోటీస్

Update: 2025-11-17 06:30 GMT

ఏపీ సీఎం చం­ద్ర­బా­బు పా­ర్టీ బలో­పే­తం­పై దృ­ష్టి కేం­ద్రీ­క­రిం­చా­రు. కొం­త­మం­ది టీ­డీ­పీ ఎమ్మె­ల్యేల వ్య­వ­హార శైలి చర్చ­నీ­యాం­శ­మైన నే­ప­థ్యం­లో చం­ద్ర­బా­బు పా­ల­న­తో పా­టు­గా పా­ర్టీ­పై­నా ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టి­న­ట్లు తె­లు­స్తోం­ది. ఏపీ­లో టీ­డీ­పీ కూ­ట­మి అధి­కా­రం­లో­కి వచ్చి సు­మా­రు­గా 16 నె­ల­లు దా­టి­పో­యిం­ది. అయి­తే ఇన్ని రో­జు­లై­నా కొం­త­మం­ది ఎమ్మె­ల్యే­లు తీరు మా­ర్చు­కో­లే­ద­ని చం­ద్ర­బా­బు భా­వి­స్తు­న్న­ట్లు సమా­చా­రం. ము­ఖ్యం­గా ప్ర­జ­ల్లో ఉం­డా­లం­టూ తాను చే­సిన సూ­చ­న­లు పా­టిం­చ­డం లే­ద­ని భా­వి­స్తు­న్న­ట్లు తె­లి­సిం­ది. ఇటీ­వ­లే 48 మంది ఎమ్మె­ల్యే­ల­కు నో­టీ­సు­లు ఇవ్వా­ల­ని చం­ద్ర­బా­బు ఆదే­శిం­చిన సం­గ­తి తె­లి­సిం­దే. ప్ర­భు­త్వ కా­ర్య­క్ర­మా­ల్లో కొం­త­మం­ది ఎమ్మె­ల్యే­లు చు­రు­గ్గా పా­ల్గొ­న­డం లే­ద­ని చం­ద్ర­బా­బు దృ­ష్టి­కి వచ్చి­న­ట్లు సమా­చా­రం. ఎన్టీ­ఆ­ర్ భరో­సా పిం­ఛ­న్ల పం­పి­ణీ, ము­ఖ్య­మం­త్రి సహాయ నిధి చె­క్కుల పం­పి­ణీ కా­ర్య­క్ర­మా­ల్లో పా­ల్గొ­న­కుం­డా కొం­త­మం­ది ఎమ్మె­ల్యే­లు అల­స­త్వం ప్ర­ద­ర్శి­స్తు­న్న­ట్లు చం­ద్ర­బా­బు దృ­ష్టి­కి వచ్చిం­ది. వి­ప­క్షం చేసే దు­ష్ప్ర­చా­రం తి­ప్పి­కొ­ట్టా­ల­ని ఎప్ప­టి­క­ప్పు­డు మా­ర్గ ని­ర్దే­శం చే­స్తూ వస్తు­న్నా­రు. ఈ క్ర­మం­లో­నే చం­ద్ర­బా­బు మరో ము­ఖ్య­మైన ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు తె­లి­సిం­ది. పా­ర్టీ ఎమ్మె­ల్యే­లు, ప్ర­జా ప్ర­తి­ని­ధు­ల­కు టీ­డీ­పీ అధి­ష్టా­నం కొ­త్త­గా టైమ్ టే­బు­ల్ రూ­పొం­దిం­చి­న­ట్లు సమా­చా­రం.

కీలక సూచనలతో...

ఈ టైమ్ టే­బు­ల్ ప్ర­కా­రం.. టీ­డీ­పీ ఎమ్మె­ల్యే­లు ప్ర­తి నెలా ఒకటో తేదీ క్ర­మం తప్పు­కుం­డా ఎన్టీ­ఆ­ర్ భరో­సా సా­మా­జిక భద్ర­తా పిం­ఛ­న్ల పం­పి­ణీ కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­నా­లి.అలా­గే ప్ర­తి నెలా 5వ తే­దీన తమ ని­యో­జ­క­వ­ర్గం­లో­ని ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­ను ఎమ్మె­ల్యే­లు సం­ద­ర్శిం­చా­రు. ఆ పా­ఠ­శా­ల­లో వి­ద్యా­ర్థు­ల­కు అం­దు­తు­న్న భో­జ­నం, వస­తు­ల­ను పరి­శీ­లిం­చా­లి. అలా­గే ప్ర­తి నెలా10వ తే­దీన తమ ని­యో­జ­క­వ­ర్గం పరి­ధి­లో­ని అన్న క్యాం­టి­న్‌­లో ఎమ్మె­ల్యే­లు భో­జ­నం చే­యా­ల్సి ఉం­టుం­ది. అన్న క్యాం­టీ­న్ల ద్వా­రా ప్ర­భు­త్వం అం­ది­స్తు­న్న భో­జ­నం ఎలా ఉం­ద­నే­ది తె­లు­సు­కో­వ­టం­తో పా­టు­గా ప్ర­జ­ల­కు వి­వ­రిం­చా­లి. వీ­టి­తో పా­టు­గా ప్ర­తి నెలా 15వ తే­దీన తమ ని­యో­జ­క­వ­ర్గ పరి­ధి­లో­ని ప్ర­భు­త్వ ఆసు­ప­త్రి­ని ఎమ్మె­ల్యే­లు తని­ఖీ చే­యా­లి. ఆస్ప­త్రి­లో­ని రో­గుల సమ­స్య­ల­పై వి­వ­రా­లు అడి­గి తె­లు­సు­కో­వా­లి. డా­క్ట­ర్లు, వై­ద్య సి­బ్బం­ది సమ­స్య­ల­పై­నా దృ­ష్టి పె­ట్టా­లి. అలా­గే 20వ తే­దీన ము­ఖ్య­మం­త్రి సహాయ నిధి చె­క్కుల పం­పి­ణీ, టీ­డీ­పీ కా­ర్య­క­ర్తల బీ­మా­కు సం­బం­ధిం­చిన చె­క్కు­ల­ను పం­పి­ణీ కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­నా­ల్సి ఉం­టుం­ది.

Tags:    

Similar News