Chandrababu Delhi Tour: కేంద్ర పెద్దలను కలిసే ప్రయత్నంలో చంద్రబాబు..

Chandrababu Delhi Tour: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది.

Update: 2021-10-26 06:19 GMT

Chandrababu Delhi Tour: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఏపీలో దురాగతాలను కేంద్ర పెద్దలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోరారు. పలువురు ఇతర పార్టీల జాతీయ నేతలను సైతం కలిసే అవకాశం ఉంది. నిన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసిన చంద్రబాబు.. ఏపీలో ఎమర్జెన్సీ విధించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ దారుణాలను వివరించారు. టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడులను సీరియస్‌గా తీసుకున్నారు ఆ పార్టీ అధినేత.

Tags:    

Similar News