ప్రజాసమస్యలపై పోరాటం.. చంద్రబాబు సమావేశం
పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులతో చంద్రబాబు సమావేశమయ్యారు.;
పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులతో చంద్రబాబు సమావేశమయ్యారు. వర్చువల్గా జరుగుతున్న ఈ మీటింగ్లో వివిధ ప్రజాసమస్యలపై పోరాటానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయడంపై చర్చిస్తున్నారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరననగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. మిగతా అంశాలపై కూడా ఉద్యమించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. విద్యుత్ పోరాటంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. నియోజకవర్గాల్లో సమస్యలు సహా పార్టీ వ్యవహారలపైనా లీడర్లతో మాట్లాడి స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలుసుకున్నారు.