చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు

గురువారం నుంచి 3 రోజల పాటు కుప్పంలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Update: 2021-02-25 04:00 GMT

గురువారం నుంచి 3 రోజల పాటు కుప్పంలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ సాగించిన అరాచకాలు, మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఉదయం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లనున్న చంద్రబాబు... అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా కుప్పం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గుడిపల్లిలోని రాళ్లగంగమ్మ ఆలయం దగ్గర నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మండల కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం కుప్పం రూరల్‌ మండల కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించనున్నారు. ఈ రోజు రాత్రి చంద్రబాబు కుప్పంలోనే బస చేయనున్నారు.

శుక్రవారం ఉదయం రామకుప్పం మండల కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం శాంతిపురం కార్యకర్తలతో సమీక్షించనున్నారు. శుక్రవారం కూడా క్పుప్పంలోనే బస చేయనున్న చంద్రబాబు.. శనివారం ఉదయం కుప్పం మున్సిపాలిటీ కార్యకర్తలతో చర్చించనున్నారు. శనివారం మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి శనివారం సాయంత్రం విజయవాడ ప్రయాణం కానున్నారు.


Tags:    

Similar News